12 జనవరి 2015 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహణ.
స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం 1985 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నది. 2015 సంవత్సర జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద యొక్క 152వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.
యువతలో దాగున్న నిగూఢశక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం
• స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధ హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.
• ఆయన హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
• ఆయన తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు లలో యోగ, వేదాంత శాస్త్రములను పరిచయం చేశారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఆయన.
• ఆయన భారత దేశ తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రపంచానికి చాటిచెప్పారు.
• స్వామీ వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో 4 జూలై 1902న పశ్చిమబెంగాల్ లోని బెలూర్ లో మరణించారు.
స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం 1985 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నది. 2015 సంవత్సర జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద యొక్క 152వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.
యువతలో దాగున్న నిగూఢశక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం
స్వామీ వివేకానంద గురించి :
• స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధ హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.
• ఆయన హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
• ఆయన తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు లలో యోగ, వేదాంత శాస్త్రములను పరిచయం చేశారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఆయన.
• ఆయన భారత దేశ తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రపంచానికి చాటిచెప్పారు.
• స్వామీ వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో 4 జూలై 1902న పశ్చిమబెంగాల్ లోని బెలూర్ లో మరణించారు.
No comments:
Post a Comment